Ticker

6/recent/ticker-posts

రైల్వే డిపార్టుమెంటు లో 26,502 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 26,502 టెక్నికల్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిరుద్యోగులకు అందించిన అద్భుతమైన అవకాశం ఇది! 
ఈరైల్వే ఉద్యోగాలకు ఎంపికైతే.. పోస్టును బట్టి ప్రొడక్షన్‌ యూనిట్‌, వర్క్‌షాప్‌, జనరల్‌ సర్వీస్‌, క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌, డీజిల్‌ షెడ్‌, ట్రాక్‌ మెషిన్‌, టెలీకమ్యూనికేషన్‌ సిస్టమ్‌, సిగ్నల్‌ సిస్టమ్‌ వంటి వివిధ డిపార్ట్‌మెంట్లలో ఆపరేటర్‌, ఫిట్టర్‌, డ్రైవర్‌, పెయింటర్‌ పోస్టులతోపాటు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సివుంటుంది. నెల జీతం రూ.35,000 నుంచి రూ.40,000 వరకు వస్తుంది. 


అర్హత:

  •  పదోతరగతి తర్వాత ఐటీఐ పూర్తి చేసినవారు ్య 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసినవారు.
  •  పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన తర్వాత 3 సంవత్సరాల ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారు. 
  •  మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసినవారు.
  •  చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పోస్టులకు అనర్హులు. 
వయః పరిమితులు:

జనరల్‌ కేటగిరీవారు 18-28 సంవత్సరాల మధ్యవారై ఉండాలి. 01-07-2018తో సరిచూసుకొని అభ్యర్థుల వయసు నిర్ణయిస్తారు. రిజర్వేషన్‌ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు:
 ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేయడానికి చివరితేది: 05-03-2018. 

ప్రథమ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: ఏప్రిల్‌, మే నెలల్లో ఉంటుంది. 

అభ్యర్థులు ఏ రైల్వే జోన్‌కు దరఖాస్తు చేయాలో నిర్ణయించుకుని, ఆయా రైల్వే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేసి, ఫీజు చెల్లించాలి. ఏదైనా ఒక రైల్వే జోన్‌కు మాత్రమే అప్లై చేయాలి. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే పూర్తి చేయాలి. 

ఎంపిక ప్రక్రియ: అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ), టెక్నిషియన్‌ పోస్టులకు దరఖాస్తు చేసినవారు మొదట కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారికి రెండో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. మొదటి పరీక్షలోని మార్కులు క్వాలిఫయింగ్‌ మార్కులు మాత్రమే. రెండో పరీక్షలోని మార్కుల ఆధారంగా టెక్నిషియన్‌ పోస్టులను భర్తీ చేస్తారు. 
ఏఎల్‌పీ పోస్టుకు దరఖాస్తు చేసినవారికి రెండో సీబీటీ తర్వాత కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. రెండో సీబీటీలో వచ్చిన మార్కుల్లో 70%, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో వచ్చిన వాటిల్లో 30% మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.

మరిన్ని వివరాలకు,అప్లై చేయుటకు:Click Here

Post a Comment

0 Comments