Ticker

6/recent/ticker-posts

ఓయూలో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు శ్రీకారం

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రారంభించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ సెయింట్ లూయిస్ (యూఎంఎస్ఎల్)తో ఆన్‌లైన్‌లో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. మార్చి 18న నిర్వహించిన దూర దృశ్య సమీక్ష (వీడియో కాన్ఫరెన్స్)లో ఓయూ ఉపకులపతి ప్రొ.రామచంద్రం, ఈఎంఆర్‌సీ సంచాలకులు ప్రొ.కె.నరేందర్, ప్రొ.శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు కోర్సుల్లో సంయుక్తంగా డిగ్రీలు ఇవ్వాడానికి రెండు యూనివర్సిటీల అధికారులు అంగీకరించారు. ఈ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి విభాగం నుంచి పది మంది విద్యార్థుల చొప్పున మొత్తం 40 మందికి ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. యూఎంఎస్ఎల్ యూనివర్సిటీ ఉపకులపతి థామస్ ఎఫ్ జార్జ్, చికాగోలోని భారత కాన్సుల్ జనరల్ నీతా భూషణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments