ఏపీ పోస్టల్ సర్కిల్లో 245 పోస్టులు
- పోస్టుమెన్ 234 - మెయిల్ గార్డు 11
- పోస్టుమెన్ 234 - మెయిల్ గార్డు 11
పదోతరగతి విద్యార్హతతోనే జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది తపాలా శాఖ. పోస్టు మెన్, మెయిల్ గార్డు అంటే ఇవేవో చిన్న ఉద్యోగాలే అనుకోవడం పొరపాటే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం ఈ రెండు ఉద్యోగాలకూ 21700 మూలవేతనం దక్కుతుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్ వచ్చినప్పటికీ పాతికవేల రూపాయల నెల జీతం గ్యారెంటీ. అంతేకాకుండా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు సైతం పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి రైల్వే ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వీటినీ ప్రయత్నించవచ్చు.
ఖాళీల వివరాలు: పోస్టుమ్యాన్ ఖాళీలు విజయవాడ రీజియన్లో 106, కర్నూలులో 60, విశాఖపట్నంలో 68 ఉన్నాయి. మెయిల్ గార్డు పోస్టులు విజయవాడ రీజియన్లో 6, కర్నూలులో 2, విశాఖపట్నంలో 3 ఉన్నాయి.
అర్హత: పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
వయసు 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
అర్హత: పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
వయసు 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరితేదీ: మార్చి 15, హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 16
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరితేదీ: మార్చి 15, హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 16
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20.
నోటిఫికేషన్&అప్లై చేయుటం కోసం:Click Here
0 Comments